Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన కార్యదర్శిగా దేబసిస్రారు ఎన్నిక
వేలూరులో జరిగిన మహాసభలో 3వ రోజు జాతీయ అధ్యక్షులుగా కెేపీ సహదేవన్ (కేరళ), ప్రధాన కార్యదర్శిగా దేబసిస్ రారు(పశ్చిమ బెంగాల్) ఎన్నికయారు. వీరితోపాటు 9 మంది ఉపాధ్యక్షులు, 9 మంది కార్యదర్శులు, వర్కింగ్ కమిటీ సభ్యులుగా 47 మంది, కోశాధికారిగా బియన్సన్సాల్ (పశ్చిమబెంగాల్)ను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన పి.చైతన్య అఖిల భారత బీడీ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్గా ఎన్నికయ్యారు.
మహాసభ ఆమోదించిన తీర్మానాలు
శ్రీ వెయ్యి బీడీలు చుట్టేందుకు రూ.350 జాతీయ కనీస వేతనంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి.
శ్రీ పెరిగే నిత్యావసరస వస్తువుల ధరలకు అనుగుణంగా కరువు భత్యాన్ని పెరిగిన ప్రతి పాయింటుకూ ఐదు పైసలు చెల్లించాలి.
శ్రీ బీడీలపై విధించిన 28 శాతం వస్తుసేవా పన్నును ఉపసంహరించుకోవాలి.
శ్రీ వెయ్యి బీడీలు చుట్టేందుకు అవసరమైనంత నాణ్యమైన ఆకును బీడీ ఫ్యాక్టరీల యజమానులు ఇవ్వాలి. కార్మికులు చుట్టిన బీడీలు తక్కువ వచ్చాయనే పేరుతో వేతనంలో కోత విధించరాదు.
శ్రీ వారానికి ఆరు రోజులు పని ఇవ్వాలి, పని ఇవ్వని రోజున కార్మికునికి 50 శాతం వేతనం యజమానులు చెల్లించాలి.
శ్రీ బీడీ పరిశ్రమలో అమలవుతున్న కాంట్రాక్టు, సబ్ కాంట్రాక్టు పద్ధతిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి.
శ్రీ యాజమానుల పేరు మీదనే ప్రావిడెంట్ ఫండ్ కోడ్ నంబర్లు ఇవ్వాలి. కాంట్రాక్టర్ పేరు మీద ఇవ్వకూడదు.
శ్రీ కార్మికులందరికీ ఫోటో అతికించిన గుర్తింపు కార్డులు యాజమానులు ఇవ్వాలి.
శ్రీ కార్మికుల చట్టాలను అమలు చేయాలి.
శ్రీ కార్మికులకు సంవ్సతరానికి ఒకసారి 8.33 శాతం బోనస్ యాజమానులే ఇవ్వాలి. తదితర డిమాండ్లను అంగీకరించాలి.
శ్రీ తమ కోర్కెలను తీర్చాలని పది లక్షల మంది బీడీ కార్మికుల సంతకాలతో ప్రధానమంత్రికి వినతి పత్రం ఇవ్వాలి.
శ్రీశైలంలోకి పెరిగిన వరద ప్రవాహం
జూరాల వద్ద పర్యాటకుల తాకిడి విజయనగరం : శ్రీశైలంలోకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జూరాల, తుంగభద్ర నుంచి 1,35,000 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంలోకి వస్తోంది. జూరాల వద్ద పర్యాటకుల తాకిడి పెరిగింది. తుంగభద్ర నుంచి 17,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా జూరాల నుంచి 1,18,000 క్యూసెక్కులు వస్తోంది. శ్రీశైలం నీటి నిలువ సామర్థ్యం 885 అడుగులకు గాను శనివారం 844 అడుగులు ఉండేది. ఆదివారం 848.9 అడుగులకు చేరింది. 215 టిఎంసిలకు గాను ప్రస్తుతం 77.69 టిఎంసిలు వుంది. కృష్ణా నది ఎగువన కూడా వరద కొనసాగుతూనే ఉంది. అల్మట్టిలోకి 33,400 క్యూసెక్కులు వస్తుండగా వచ్చిన నీటిని దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణ్పూర్లోకి 47,266 క్యూసెక్కుల వస్తుండగా 44,386 క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాలలోకి 1,13,326 క్యూసెక్కులు వస్తుండగా 1,18,000 క్యూసె క్కులను శ్రీశైలం వైపు వదులుతున్నారు. జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతుండటంతో ఆ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు భారీ ఎత్తున వచ్చారు.
నాగావళికి స్వల్ప వరద
విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నాగావళి నదిలోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. తోటపల్లి రిజర్వాయర్లోకి 3,870 క్యూసెక్సుల నీరు వచ్చి చేరుతుండటంతో గేట్లను ఎత్తివేసి 1,870 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కాలువల ద్వారా 1,420 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు.