Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ప్రయాణీకుల మధ్య తలెత్తే ఘర్ణణలను నివారించేందుకు రంగం సిద్ధం చేశాయి. రిజర్వుడ్ బోగీల్లో క్రింది, మధ్య బెర్త్ల ప్రయాణికులు త్వరగా పడుకోవడం వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటోందని, ఈ విధంగా ఎక్కువసేపు నిద్ర పోవడాన్ని నిరోధించాలని నిర్ణయించింది. ఈమేరకు బెర్తుల్లో నిద్రపోయే వేళలను కుదించింది. రైల్వే బోర్డు గత నెల 31న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం... ప్రయాణీకులు రాత్రి10 గంటల నుంచి ఉద యం 6గంటల మధ్యలో మాత్రమే బెర్తుల్లో పడుకోవచ్చు. రాత్రి 10 గంటల కన్నా ముందు, ఉదయం ఆరు గంటల తర్వాత సీట్లలో ఇతరులు కూర్చోవడానికి అవకాశం కల్పించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే గర్బిణీలు, అనారోగ్య వంతు లు, దివ్యాంగులు ఈ వేళల కన్నా ఎక్కువ సేపు నిద్రపోవాలనుకుంటే, వారికి ఇతర ప్రయాణికులు సహకరించాలని పేర్కొ న్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం క్రింది, మధ్య బెర్తుల్లో ప్రయాణికులు రాత్రి 9గంటల నుంచి ఉదయం6 గంటల వరకు నిద్రపోయేందుకు అనుమతి ఉంది. ఇండియన్ రైల్వే మాన్యుఅల్, వాల్యూమ్-1లోని 652వ పేరాలో సమరణలు చేపట్టినట్టు రైల్వే శాఖ అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా తెలిపారు. ప్రయాణీకుల మధ్య వివాదాలు తలెత్తినట్టయితే టీటీఈలు పరిష్కరించాలని కోరారు.