Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్ పూర్ బీఆర్డీ ఆస్ప త్రిలో చిన్నారుల మృతి కేసులో ఆక్సిజన్ సప్లయర్స్ కంపెనీ యజమా నిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బీఆర్డీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా 60 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరా చేస్తున్న పుష్పా సేల్ కంపెనీ యజమాని మనీశ్ బండారిని ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు జిల్లా ఎస్పీ అనిరుధ్ సిద్దార్థ పంకజ్ వెల్లడించారు. బండారికి వైద్య పరీక్షలు చేయించామని, త్వరలోనే అతడిని కోర్టులో హాజరుపరుస్తామని ఆయన వివరించారు. ఆస్పత్రిలో చిన్నారుల మృతికి ఆక్సిజన్ కొరత కాదని ఓవైపు యోగి ఆదిత్యనాథ్ సర్కారు వాదిస్తుండగా.. మరోవైపు ఈ అరెస్టు జరగడం గమనార్హం.