Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గుండెపోటుతో మృతి చెందిన మార్షల్ అర్జన్సింగ్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నివాళులర్పించారు. ఢిల్లీలో 7-ఏ కౌటిల్యమార్గ్లో ఉన్న అర్జన్సింగ్ నివాసం వద్ద ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి అంజలి ఘటిం చారు. అంతకుముందు త్రివిధ దళాల అధిపతులు మార్షల్ బీరేంద్రసింగ్ (వాయుసేన), అడ్మైరల్ సునీల్ లాంబ (నావి కాళం), జనరల్ బిపిన్ రావత్లు ( ఆర్మీ చీఫ్ ) అర్జన్సింగ్కు నివాళులర్పించారు. అర్జన్సింగ్ పార్థీవదేహాన్ని సందర్శిం చేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. మూడు దశాబ్దాలకుపైగా వైమానిక దళంలో సేవలందించిన మార్షల్ అర్జన్సింగ్(98) శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. తీవ్ర గుండెపోటు రావడంతో ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.
నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు :
మార్షల్ అర్జన్ సింగ్ భౌతిక కాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ కంటోన్మెంట్లో అధికార లాంఛనాల మధ్య ఆయనకు తుది వీడ్కోలు పలకనున్నారు. కాగా.. మార్షల్ అర్జన్సింగ్ మృతికి నివాళిగా రేపు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న జాతీయ జెండాలను అవనతం చేయనున్నట్టు కేంద్ర హోంశాఖ పేర్కొన్నది.