Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సమాచార హక్కు చట్టం ( ఆర్టీఐ యాక్ట్ ) నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి (సీబీఐ) ఎలాంటి మినహాయింపు లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టీఐ యాక్ట్లోని సెక్షన్-24 ప్రకారం.. ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ విభాగాలైన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికా రులకు సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు అందించాల్సిన అవసరం లేదని సీబీఐ చేసిన వాదన లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆర్టీఐ
ఆర్టీఐ నుంచి సీబీఐకి మినహాయింపు లేదు
చట్టం నుంచి సీబీఐకి ఎలాంటి మినహాయింపులేదని తెలి పింది. అవినీతి ఆరోపణలు, హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని దరఖా స్తుదారులకు అందజేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అవినీ తికి పాల్పడ్డ అధికారుల సమాచారం అందజేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీజే కరీరా అనే సామాజిక కార్యకర్త ఆర్టీఐ యాక్ట్ కింద దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆయన అడిగిన సమాచారాన్ని అందజేసేందుకు సీబీఐ నిరాకరించింది. దీంతో, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు.