Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
నెల్లూరు : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కంటేపల్లి దళితవాడ ప్రాథ మిక పాఠశాలకు అక్షయపాత్ర ఫౌండేషన్ సోమ వారం సరఫరా చేసిన భోజనంలో బల్లి పడింది. అప్పటికే ఆభోజనం తిన్న విద్యార్థులు, ఉపాధ్యా యులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే 108 ద్వారా వెంకటాచలం ఆస్పత్రికి తరలించారు. రోజులాగే అక్షయపాత్ర ఫౌండేషన్ సోమవారమూ కంటేపల్లి ఎస్సి ప్రాథమిక పాఠశాలకు భోజనం, రసం సరఫరా చేసింది. అప్పటికే రసంలో బల్లి పడి బాగా ఉడికిపోయింది. ఆరసం వేసుకుని విద్యార్థుల తో పాటు ఉపాధ్యాయులు తిన్నారు. కొద్ది సేపటికి ఎనిమిది మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. భోజనం పూర్తయిన అనంతరం రసం పారపోస్తుండ గా అందులో ఉన్న బల్లి కింద పడటంతో విషయం బయటపడింది. ఉపాధ్యాయులు ఆందోళన చెంది 108లో విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంకటాచలం తహశీల్దార్ సోమ్ల నాయక్, ఎంఇఒ కొండయ్య ఆస్పత్రి వద్ద విద్యార్థులను పరామర్శించారు. అక్షయపాత్ర ఫౌండేషన్ పెట్టే భోజనం గురించి ఫిర్యాదు చేస్తూ పిల్లల తల్లిదండ్రులు తహశీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఖాజామస్తాన్, ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులను పరామర్శించారు.