Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3,500 కోట్లకు వెయ్యి కోట్లే వచ్చాయి
- నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యాన్ని సహించను
- 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు : సీిఎం చంద్రబాబు నాయుడు
ఏలూరు : పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఇసిఆర్ఎఫ్ (ఎర్త్ కం రాక్ఫిల్ డ్యాం) పనులను నవంబరులో ప్రారంభిం చనున్నట్లు ముఖ్య మంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను సోమవారం మధ్యాహ్నం ఆయన పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గం గుండా స్పిల్వే పనులను, గేట్లు తయారీ పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లా డుతూ.. పోలవరం భూసేకరణకు కొందరు అడ్డుపడుతున్నారని, అందర్నీ మెప్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్వాసితుల పేర్లగల్లంతు లాం టి చర్యలను సహించేది లేదన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి రూ.3,500 కోట్లకుగాను ఇప్పటి వరకూ కేంద్రం నుంచి వెయ్యి కోట్లే వచ్చాయని చెప్పారు. మిగతా మొత్తం పెండింగ్లో ఉందని తెలిపారు. రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసి కేం ద్రానికి పంపించామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.50వేల కోట్లు అవు తుందని, అందులో రూ.32వేలకోట్లు భూసేకరణకే ఖర్చవుతుందని చెప్పారు.
సీిఎంను కలిసిన విలీన మండలాల నిర్వాసితులు
పరిహారం జాబితాలో పేర్లు గల్లంతు, కొన్ని గ్రామాలు ముంపునకు గురికావంటూ పరిహారం ఇవ్వకపోవడంపై కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నిర్వాసితులు సీఎంను కలిసి వినతిపత్రం అందించారు. గ్రామాల్లో ఇళ్లు ఉండి వేరే ప్రాంతంలో పని చేసుకుంటున్న వారికి పరిహారం అందిస్తా మని సీఎం తెలిపారు. ముంపునకు గురికాని గ్రామాలకు సంబంధించి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో మంత్రులు దేవినేని ఉమ, పైడికొండల మాణి క్యాలరావు, ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.