Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'జన్ కేంద్ర న్యాయశాఖ నియామకం
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
హైదరాబాద్లోని ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు అదనపు న్యాయ మూర్తులు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోద ముద్ర వేసింది. ఆరుగురు అదనపు న్యాయ మూర్తుల్లో ఐదుగురు పి కేశవరావు, కె విజయలక్ష్మి, ఎం గంగారావు, అభినంద్కుమార్, అమర్నాథ్గౌడ్ ప్రస్తుతం ఇదే హైకోర్టులో న్యాయ వాదులుగా విధులు నిర్వహిస్తున్నారు.
కాగా మరొకరు డివి సోమయా జులు విశాఖపట్నం జిల్లా కోర్టు నుంచి నియమితులయ్యారు. గతేడాది మే నెలలో ఉమ్మడి హైకోర్టు కోలీజియం ఐదుగురు న్యాయవాదుల, ఐదుగు రు జిల్లా న్యాయమూర్తుల పేరు పదోన్నతికి ప్రతిపాదించింది. ఈ పది పేర్లలో ప్రస్తుతం ఆరుగురికి పదోన్నతి దక్కింది. ప్రస్తుతం ఉమ్మడి హై కోర్టు మంజూరు అయిన జడ్జిల సంఖ్య కన్నా సగం మంది జడ్జిలతో పని చేస్తోంది. మొత్తం 61న్యాయమూర్తులు పోస్టులు మంజూరవగా అందు లో 34 ఖాళీలున్నాయి. ఈ నెలఖారున మరో న్యాయమూర్తి రిటైర్ కాబో తున్నారు. అలాగే ఉమ్మడి హైకోర్టుతో పాటు యూపీలోని అలహాబాద్ హైకోర్టుకూ 19 మంది అదనపు న్యాయమూర్తులను నియమించారు.