Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఐటీ కాన్పూర్కు నిర్వహణ బాధ్యతలు
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది (2018) మే20న ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)-అడ్వాన్స్డ్ నిర్వహించ నున్నట్టు జాయింట్ అడ్మిషన్ బోర్డు వెల్లడిం చింది. జేఈఈ (అడ్వాన్స్డ్) నిర్వహణ బాధ్యతలను కాన్పూర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ( ఐఐటీ ) అప్పగించింది. జేఈఈ అడ్వాన్స్డ్ వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లోనూ నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్, జాయింట్ అడ్మిషన్ బోర్డు ( జాబ్ ) చైర్మెన్ ప్రొఫెసర్ భాస్కర్ రామమూర్తి అధ్యక్షతన జరిగిన గత సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జేఈఈ మెయిన్స్ ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లోనూ నిర్వహిస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ కూడా ఆన్లైన్లో నిర్వహించాలనే ప్రతిపాదన ఈఏడాది తెరపైకి వచ్చింది. జేఈఈ మెయిన్స్ తేదీని సీబీఎస్ఈ డిసెంబర్లో ఖరారు చేయనుంది. ఇదిలా ఉండగా, మద్రాస్ ఐఐటీ ఈఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించింది. ఈపరీక్షలో 2లక్షల 21వేల మంది విద్యార్థులు అర్హత సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్లో అర్హత సాధించిన విద్యార్థులకు మెయిన్స్ నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.