Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనేశ్వర్ : ఒడిషా చిట్ఫండ్ కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర అధికార పార్టీ బిజూ జనతాదళ్(బీజేడీ) ఎమ్మెల్యే ప్రభాత్ బిస్వాల్ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అరెస్టు చేసింది. బిస్వాల్ను సీబీఐ అధికారులు సోమవారం రాత్రే అదుపులోకి తీసుకున్నప్పటికీ.. ఆయనను అరెస్టు చేసినట్టు మంగళవారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. ఒడిషాలోని 44 పోంజి కంపెనీల్లో ఒకటైన సీషోర్ గ్రూపుతో భూ లావాదేవీలకు సంబంధించి రూ.500 కోట్ల మేర అక్రమాలు చోటు చేసుకున్నాయని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొన్నది. ఈ వ్యవహారానికి సంబంధించి బిస్వాల్ను, ఆయన భార్య లక్ష్మిబిలాసినిని సీబీఐ ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది. కాగా బిస్వాల్ను కటక్లోని తన నివాసంలో సీబీఐ అధికారులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అయితే.. దీనిని కేంద్రం కుట్రగా బీజేడీ నేత సుభాష్ సింగ్ అభివర్ణించారు. సీబీఐని మోడీ సర్కారు రాజకీయ లబ్ది కోసం వాడుకుంటోందని ఆయన విమర్శించారు. 2008లో మాలెగావ్లో పేలుడు కేసు...