Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మాలెగావ్ పేలుళ్ల కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కోర్టు ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఈకేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సుధాకర్ చతుర్వేది, సుధాకర్ ద్వివేదీ అలియాస్ శంకరాచార్యలకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ఎన్ఐఏ కోర్టు జస్టిస్ ఎస్డీ టెకాలే ఆదేశాలు జారీ చేశారు. 2008, సెప్టెంబర్29న నాసిక్ జిల్లాలోని మాలెగావ్ నగరంలో పేలుళ్లు సంభవించాయి. మోటార్సైకిల్లో అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ సహా 12మంది అరెస్ట్ అయ్యారు. బాంబే హైకోర్టు ఠాకూర్కు బెయిల్ మంజూరు చేయగా, లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ను విడుదల చేయాలని ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈకేసులో కీలక నిందితులిద్దరికీ బెయిల్ లభించడంతో సుధాకర్ చతుర్వేదీ, సుధాకర్ ద్వివేదీల బెయిల్ పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు అనుమతించింది.