Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మితవాద శక్తుల బెదిరింపులే కారణం : విద్యార్థి నేతల ఆరోపణలు
లక్నో: మితవాద శక్తుల బెదిరింపులకు తలొగ్గి వర్సిటీలో ఏర్పాటు చేసిన సెమినార్ను రద్దు చేసుకున్నట్టు అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం మంగళవారం పేర్కొన్నది. ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మితవాద శక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయని తెలిపింది. అందుకే, లిబర్టీ ఫెస్టివల్ పేరిట నిర్వహించాలని భావించిన ఈ కార్యక్రమాన్ని ఉపసంహరించుకోక తప్పలేదని విద్యార్థి విభాగం నేత మనీష్ శర్మ తెలిపారు. హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ నుంచి బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చిన విషయాన్ని అలహాబాద్ వర్సిటీ వీసీ రతన్లాల్ హంగ్లూకు ఫిర్యాదు చేశానని అన్నారు. కాగా, భారత పార్లమెంట్ భవనంపై దాడికి పాల్పడ్డ కేసులో అఫ్జల్ గురు అనే ఉగ్రవాదిని న్యాయస్థానం దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో గతేడాది ఫిబ్రవరిలో అఫ్జల్గురు నాలుగో వర్ధంతి వేడుకలను ఢిల్లీ జేఎన్యూలో నిర్వహించాలని ఓ వర్గం ప్రయత్నించింది.
అయితే, ఈ వార్త సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో వారు వెనక్కి తగ్గారు. లిబర్టీ ఫెస్టివల్ కార్యక్రమం కూడా ఢిల్లీ జేఎన్యూలో జరిగిన ప్రోగ్రామ్ లాంటి దనే తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. ఈనెల 23న సమసమాజ స్థాపన అంశంపై సెమినార్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మద్రాస్ ఐఐటీ కూడా తాజాగా వెనక్కి తగ్గింది. ఈ సదస్సును రద్దు చేసుకున్నట్టు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో ఏ కార్యక్రమం నిర్వహించినా దానిపై యాంటీ నేషనల్ ముద్ర వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని జేఎన్యూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.