Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమిత్షా వ్యాఖ్యల్ని కొట్టి పడేసిన ఆర్థిక పరిశోధనా నివేదిక
న్యూఢిల్లీ: ఆర్థికవృద్ధి మందగించడం వాస్తవమని, సాంకేతికం కాదని ఎస్బీఐ పరిశో ధనా నివేదిక వెల్లడించింది. 2016 సెప్టెంబర్ నుంచి వరుసగా వృద్ధి రేట్ పడిపోవ డాన్ని ఎస్బీఐ నివేదిక గుర్తు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (మార్చి- జూన్)లో వృద్ధిరేట్ పడిపోవడం సాంకేతికంగా తాత్కాలికం కాదని నివేదిక స్పష్టం చేసింది. ఆర్థిక వృద్ధి మందగింపు కొనసాగుతున్న సమయంలో ఇది తాత్కాలికమా..? కాదా..? అన్నది ఇప్పుడే తేల్చలేమని నివేదిక పేర్కొన్నది. జీడీపీ వృద్ధి రేట్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 5.7 శాతంకు పడిపోయిన విషయం తెలిసిందే. అది మూడేండ్ల కనిష్టమన్నది గమనార్హం. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు అమిత్షా వ్యాఖ్యానిస్తూ..వృద్ధి రేట్ పడిపోవడం సాంకేతిక కారణాల వల్ల అంటూ సమర్థించుకునేందుకు యత్నించారు. ఇప్పుడు ఎస్బీఐ నివేదికతో ఆయన మాటలకు విలువలేనట్టే.
గత 25 ఏండ్లుగా దేశ ఆర్థిక వృద్ధిరేట్ స్థిరంగా పెరుగుతూ వచ్చిందని, ఇప్పుడు ఆకస్మికంగా పడిపోయిందని, ఈ స్థితి నుంచి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాల్సి ఉన్నదని నివేదిక సూచించింది. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్న సందర్భంలోనూ భారత్ తన వృద్ధిరేట్ను నిలబెట్టుకోగలి గిందని, ప్రస్తుత పరిస్థితి గతంలో తలెత్తలేదని ఎస్బీఐ నివేదిక స్పష్టం చేసింది.