Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా: సీపీఐ(ఎం) సీనియర్ నేత, పార్టీ బెంగాల్ రాష్ట్ర కమిటీ సభ్యులు నకుల్ మహతో(93) బుధవారం కన్నుమూశారు. పార్టీకి ఆయన 47 ఏండ్లకు పైగా సేవలందించారు. రాష్ట్రంలోని పురులియా జిల్లాలో పార్టీని విస్తరింప జేసేందుకు కృషి చేసిన వారిలో మహతో ఒకరు. చివరిసారి జరిగిన పార్టీ సమా వేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీకి శాశ్వత ఆహ్వానితుడిగా మహతో ఎన్నికయ్యారు. సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నేతలు.. మహతో భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.