Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో పెరుగుతోంది :కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు
అమరావతి: కేంద్రంలో వృద్ధి ఆగిపోయిందని, అదే సమయంలో రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంచి రాజకీయాల ద్వారానే ఇది సాధ్యమని, అధికారులు కూడా మంచి పరిపాలనలో రాజకీయాలకు సహకరించాలన్నారు. బుధవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తాము 2014 ఎన్నికల్లో 1.6 శాతం ఓట్లతో గెలిచామని, నంద్యాల ఉప ఎన్నికలో అది 16 శాతానికి చేరుకుందని పేర్కొన్నారు. ఉద్యోగంలో చేరాక అధికారులు 30 ఏండ్లపాటు ఉంటారని, తాము ప్రతి ఐదేండ్లకోసారి ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉందని తెలిపారు. గతంలో పండ్లే అధికారానికి దూరంగా ఉన్నామని, ఇప్పుడు అటువంటి పొరపాటు జరగకుండా చూడాలని కోరారు. ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారానే మంచి రాజకీయాలకు సహకరించాలని కోరారు. మరోవైపు తాను అనుసరిస్తున్న విధానాల ఫలితంగా వృద్ధి రేటు అనూహ్యంగా పెరుగుతోందని, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 11.72 శాతం వృద్ధిని సాధించామన్నారు. 15 శాతానికి చేరుకోవాల్సి ఉందన్నారు. మరోవైపు కేంద్రంలో గత మూడేండ్లలో వృద్ధి రేటు ఆగిపోయిందన్నారు. మరో ఏడాదిన్నరలో తాము పరీక్షలకు వెళ్లాల్సి ఉన్నందున అధికారులు కూడా సహకరించాలని, ఇందులో కలెక్టర్లది కీలకపాత్రని తెలిపారు. దీనికి వెంటనే స్పందించిన సీఎస్ దినేష్కుమార్ మాట్లాడుతూ మంచి పరిపాలనతోనే అభివృద్ధి సాధ్యమని, రాజకీయాలూ ముందుకెళతాయని అన్నారు. సీఎం రాజకీయ వ్యాఖ్యను సీఎస్ నిర్మొహమాటంగా ఖండించడం చర్చనీయాంశమయ్యింది.