Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశ్రమంలో 600 పుర్రెలు, మానవ కళేబరాల గుర్తింపు
- గుర్మీత్ దుర్మార్గాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి...
చంఢగీఢ్: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ దుర్మా ర్గాలు.. తవ్విన కొద్ది బయట పడుతున్నాయి. సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంలో 600 మృతదేహాలను పూడ్చి పెట్టినట్టు గుర్మీత్ అనుచరుడు పిఆర్ నైన్ వెల్లడించాడు. సాధ్విలపై లైంగికదాడి కేసులో దోషిగా తేలిన గుర్మీత్.. రోతక్లోని సునారియా జైలులో శిక్షననుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కేసు విచారణలో భాగంగా గుర్మీత్ అనుచరుడు, డేరా మాజీ ఉపాధ్యక్షుడు పిఆర్ నైన్, చైర్పర్సన్ విపాసనలను సిట్ ప్రశ్నించింది. ఈ క్రమంలో డేరా అక్రమాలకు సంబంధించి నైన్ కీలక విషయాలు వెల్లడించాడు. గుర్మీత్ చేతిలో హత్యకు గురైన వారందరినీ ఆశ్రమంలోనే పూడ్చి పెట్టేవారని తెలిపాడు. అంతేకాదు.. జర్మన్ శాస్త్రవేత్త సలహా మేరకు గుర్మీత్.. మృతదేహాలు పూడ్చి పెట్టిన స్థలంలో మొక్కలు నాటించేవారని చెప్పుకొచ్చాడు.
పిల్లల అక్రమ రవాణా!
డేరా ఆశ్రమం కేంద్రంగా పిల్లల అక్రమ రవాణా కూడా సాగినట్టు తెలుస్తున్నది. తమ పిల్లలను ఆశ్రమానికి పంపా మని, వారి జాడ తెలియడం లేదని గుర్మీత్ భక్తులు ఒక్కొక్క రుగా బయటకొస్తున్నారు. చిన్న పిల్లలను వేరే వారికి అమ్మారా? లేక చంపేశారా? అని వారు ఆందోళన చెందుతున్నారు. వార్తాపత్రికలో వచ్చిన ప్రకటన ఆధారంగా పన్నెండేండ్ల క్రితం ఆశ్రమానికి రెండు నెలల కూతురును అప్పగించానని ఓ మహిళ తెలిపారు. తన కూతురు చూడటా నికి ఎన్నడూ అనుమతించలేదని, ఆమె ఎక్కడ ఉన్నదో.. ఎలా ఉన్నదో తెలియదని వాపోయారు. ఆశ్రమంలో సేవ కోసం పిల్లలను ఆశ్రమానికి పంపించాలని భక్తులపై గుర్మీత్ ఒత్తిడి తెచ్చేవాడని ఆమె.. ఓ మీడియా సంస్థకు చెప్పారు.