Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కార్
హైదరాబాద్:చెన్నైలోని సదావర్తి సత్రం భూముల్ని రూ.60.30 కోట్లకు వేలంలో పాడిన సత్యనారాయణరెడ్డి ఇంతవరకు మిగిలిన మొత్తం చెల్లించలేదని ఏపీ సర్కార్ హైకోర్టు దృష్టికి తెచ్చింది. పత్రికల్లో వచ్చిన వార్తల తో వేలం నుంచి సత్యనారాయణరెడ్డి వెనక్కి వెళ్లిపోయినట్టు తెలుస్తోందని తరఫున ప్రభుత్వ ప్రత్యేక లాయర్ రమేష్ చెప్పారు. డబ్బు చెల్లించకపోతే రెండో స్థానంలోని వ్యక్తికి చెందుతాయని, రెండో వ్యక్తి కూడా ముందుకు రాకపోతే మళ్లీ వేలం పెట్టాల్సి ఉంటుందన్నారు. రూ.22 కోట్ల పైచిలుకు ధరకు వేలంలో భూముల్ని దక్కించుకున్న వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసు శుక్రవారం విచారణ జరగనున్నది.