Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ్పూర్ : ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజి జోషి, మరో ముగ్గురికి బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రేషింబాగ్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం అభివృద్ధి, సుందరీకరణ పనులకు నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ) నిధులు ఉపయోగించినందుకు ఈ నోటీసులు జారీ చేశారు. దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తులు భూషణ్ ధర్మాధికారి, అరుణ్ ఉపాధ్యాయలు ఈ మేరకు నోటీసులిచ్చారు. మహారాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ విభాగానికి, ఎన్ఎంసీ కమిషనర్కి కూడా నోటీసులు అందాయి. వీటికి అక్టోబరు 3వ తేదీలోగా సమాధానం ఇవ్వాల్సిందిగా కోర్టు కోరింది.