Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీకి సోనియా గాంధీ లేఖ
న్యూఢిల్లీ : లోక్సభలో బీజేపీకి వున్న మెజార్టీని ఉపయోగించుకుని మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై మోడీకి ఆమె లేఖ రాసారు. రాజ్యసభలో 2010 మార్చి 9న మహిళాబిల్లును ఆమోదించారని, అప్పటి నుంచి లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందలేదని సోనియా గుర్తుచేశారు. ఈ బిల్లుకు మద్దతునిస్తున్నట్లు సోనియా ప్రకటించారు.అలాగే ఈ మహిళా బిల్లు ఆమోదం కోసం రాజకీయ పార్టీలన్నీ కలిసిరావాలని కాంగ్రెస్ కోరింది. 21వ శతాబ్దంలో భారత్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారితాత్మ్రక అవకాశమవుతుందని కాంగ్రెస్ తన ప్రకటనలో పేర్కొంది.