Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మైనర్లయిన ఇద్దరు లైంగికదాడి బాధితులకు అబార్షన్ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. బెంగళూరు, ఢిల్లీకి చెందిన బాధితులిద్దరికీ పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం గర్భస్రావం చేయవచ్చునని సూచించిన మీదట ఈ అనుమతి నిస్తూ సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. ఇద్దరు బాధితు లను ఢిల్లీ ఎయిమ్స్, బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చి ఇనిస్టి ట్యూట్ పరీక్షలు చేసి, అందించిన నివేదికలను ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. రెండు కేసుల్లోనూ తొలగించిన పిండాలను డీఎన్ఏ పరీక్షల కోసం భద్రపరచాల్సిందిగా ఆదేశించింది. వీరువురి అబార్షన్కు, ఆ తర్వాత వైద్య ఖర్చులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని కోర్టు ఆదేశించింది.