Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరిని కారుతో ఢకొీట్టిన యువకుడు
న్యూఢిల్లీ: పబ్లిక్లో పొగ త్రాగవద్దన్న ఇద్దరు యువకులను ఓ వ్యక్తి కారుతో ఢకొీట్టాడు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ దారుణ ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకున్నది. ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫొటోగ్రఫీ విద్యనభ్యసిస్తున్న ఇద్దరు స్నేహితులు గురుప్రీత్సింగ్(21), మహీందర్సింగ్(22)లు ఆదివారం ఓ ఫుడ్ కోర్టులో టిఫిన్ చేస్తున్నారు. వారి పక్కనే కూర్చున్న రోహిత్కృష్ణ మహంతా(20) ధూమపానం చేస్తున్నాడు. కాగా పబ్లిక్లో ధూమపానం చేయొద్దని అతడిని గురుప్రీత్, మహీందర్లు వారించారు. ఈ క్రమంలో వారి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఇంతలో స్థానికులు కలుగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. గురుప్రీత్, మహీందర్లు బైకుపై బయలుదేరారు. వారిపై కోపం పెంచుకున్న మహంతా తన కారుతో వారిని వెంబడించాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత వారి బైకును కారుతో ఢకొీట్టాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన స్నేహితులిద్దరినీ స్థానికులు ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురుప్రీత్ సింగ్ బుధవారం చనిపోయాడు. ఈ కేసులో మహంతాను అరెస్టు చేసిన పోలీసులు.. కొద్దిసేపటికే విడిచిపెట్టారు. దీనిపై గురుప్రీత్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని ఢకొీట్టితే.. పోలీసులు మాత్రం ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.