Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముజఫర్నగర్ : ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపు లైంగికదాడి కేసులో ప్రత్యక్ష సాక్షి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అఖిల్ గుప్తా (35)ని హత్య చేసిన కార్తీక్ హల్దార్ అనే నిందితున్ని పోలీసులు కోర్టులో హాజరుపరి చా రు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న గుప్తా భార్య కోర్టు ప్రాంగణంలో కార్తీక్పై చెప్పులతో దాడికి పాల్పడింది. కాగా, ఆశా రామ్ బాపు లైంగికదాడి కేసులో కీలక సాక్షి అఖిల్గుప్తా 2015, జనవరి11న హత్యకు గురయ్యాడు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) బృందాలు గతేడాది మార్చిలో కార్తీక్ను రారుపూర్లో అదుపులోకి తీసుకున్నాయి.
అతనిపై నమోదు చేసిన అభి యోగపత్రాన్ని గురువారం కోర్టులో దాఖలుచేయగా జడ్జి అక్టోబర్4 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.