Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బర్మా నుంచి భారత్కు..
అహమ్మదాబాద్ : దేశవ్యాప్తంగా రోహింగ్యా ముస్లిం శరణార్థుల గురించి చర్చ నడుస్తున్నది. దేశంలో రోహింగ్య ముస్లింలు అక్రమంగా చొరబడ్డారని, వారివల్ల భద్రతపరంగా ముప్పు ఉన్నదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు వారు దేశంలో ఉండకూడదంటోంది. అయితే, గుజరాత్ ముఖ్యమంత్రి విజరు రూపానీకి మయన్మార్ అప్పటి బర్మాతో సంబంధం ఉన్నది.
గుజరాత్ బాట పట్టడం వెనుక..?
1956 ఆగస్టు 2న బర్మాలోని రంగూన్ (యంగూన్)లో పుట్టారు. విజరు రూపానీ వెబ్సైట్ డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.విజరురూపానీ.ఇన్ ప్రకారం వారి కుటుంబం 1960లో పొట్ట చేతపట్టుకుని బర్మానుంచి గుజరాత్కు షిఫ్ట్ అయ్యారు. కళాశాల విద్యాభ్యాసం నుంచి ఏబీవీపీ సంస్థతో పనిచేయడం ప్రారంబించారు.
అసలు కారణమిదేనా..?
వికిపిడియాలో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రస్తుత గుజరాత్ ముఖ్యమంత్రి కుటుంబం ఆనాడు బర్మా వదలటానికి కారణాలు వేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. బర్మాలో రాజకీయపరమైన వివాదాల నేపథ్యంలో.. సుమారు మూడు లక్షల మంది ఆ దేశాన్ని వీడి భారత్లో అడుగుపెట్టారు. అక్కడ వ్యాపారంలో ఉన్న పెద్దలు ఇక్కడికి వచ్చారు. అలా రూపానీ కుటుంబం కూడా గుజరాత్ వచ్చారు. 1971లో జనసంఫ్ులో చేరారు. ఎమర్జన్సీ కాలంలో ఆయన 11 నెలలపాటు జైల్లో కూడా ఉన్నారు.
రోహింగ్యాల పట్ల మోడీ సర్కారు తీవ్ర వ్యతిరేకత
రోహింగ్యా ముస్లింల పట్ల కేంద్రం చాలా సీరియస్ ఉన్నది. అవసరాన్ని బట్టి కేంద్రమంత్రులు వారిపట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. భారత్లో ఉన్న రోహింగ్యా ముస్లింలు అక్రమ వలసదారులని, శరణార్థుల హోదా వారికి ఇవ్వలేమని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు. వారిని వెనక్కి పంపేందుకు కొందరు ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారో తనకు అర్థంకావడంలేదని ఆయన అన్నారు. రోహింగ్యాలను వెనక్కి తీసుకునేందుకు మయన్మార్ సుముఖత వ్యక్తం చేసినట్టు ఆయన తెలిపారు. ఇప్పటివరకూ రోహింగ్యాలెవరూ భారత్లో శరణు కోరుతూ దరఖాస్తు చేసుకోలేదని రాజ్నాథ్సింగ్ తెలిపారు. భారత్లోని 40,000మంది రోహింగ్యాలను వెనక్కి పంపడంలో అంతర్జాతీయ చట్టాలను తాము ఉల్లంఘించడంలేదని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఒప్పందం-1951పై భారత్ సంతకం చేయలేదని రాజ్నాథ్ తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ గురువారం ఏర్పాటు చేసిన ఓ సదస్సులో ప్రసంగిస్తూ రాజ్నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రత గురించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నదని చెబుతున్నారు.
పొంతన కుదరని లెక్కలు
దేశంలో 14 వేల మందికి పైగా రోహింగ్యా శరణార్థులు భారత్లో ఉన్నారని కేంద్ర హౌంశాఖ రిపోర్టులు ధ్రువీకరి స్తున్నాయి. సుమారు 40 వేలకు పైగా అక్రమంగా చొరబడి శరణార్థులయ్యారని వాదన. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకా రం మయన్మార్లో జరిగిన హింస కారణంగా 3.79 లక్షల మంది మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కు చేరారంటున్నది.
గుజరాత్ సీఎంపై మోడీ సర్కారు చర్య తీసుకుంటుందా..?
రోహింగ్యా శరణార్థులుగా వచ్చిన ముస్లింలను వెనక్కి తిప్పి పంపాలని మోడీ సర్కారు ప్రయత్నిస్తున్నది. మరి అదే బర్మా నుంచి వచ్చి ఏబీవీపీ, జన్సంఫ్ు అండగా విజరురూపానీ ఎదిగారు. దేశ భద్రత కు ముప్పు వాటిల్లుతున్నది ఒక్క ముస్లిం ల వల్లనేనా.. ఇతరుల వల్ల కలగదా..? అనే చర్చ నడుస్తున్నది.