Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టుకు తెలిపిన రోహింగ్యా పిటిషనర్
న్యూఢిల్లీ: మయన్మార్ నుంచి భారత్లోకి ప్రవేశించిన రోహింగ్యాలు శరణార్థులు కారని, అక్రమ వలసవాదులని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అంతకు ముందు తమకు న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన రోహింగ్యా పిటిషనర్ మహ్మద్ సలిముల్లా 'శరణార్థులు... అక్రమ వలస వాదులు కాదు' అని కోర్టుకు తెలిపారు. భారత పౌరులకూ, విదేశీయుల కూ రాజ్యాంగం సమాన భద్రత కల్పించిందని ఆయన వ్యాఖ్యానించారు. దేశభద్రతకు రోహింగ్యాల నుంచి ముప్పు ఉందంటూ వచ్చిన విమర్శలను ఆయన తోసిపుచ్చారు. 'రోహింగ్యాలు ఉగ్రవాద కార్యాకలాపాల్లో పాల్గొన లేదు. శాంతియుతంగా జీవించడానికి ఇక్కడకి శరణార్థులుగా వచ్చాం' అని చెప్పారు. అయితే రోహింగ్యాలని తిరిగి మయన్మార్కు తరలిస్తామని మోడీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే.