Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంజలి దమనియాకు బెదిరింపులు
ముంబయి : బీజేపీ ఎమ్మెల్యే ఏక్నాథ్ కద్సేకు వ్యతిరేకంగా కేసును ఉపసంహరించుకోవాలని ఆప్ మాజీ నేత, అవినీతి వ్యతిరేక ఉద్యమవేత్త అంజలి దమనియాకు బెదిరింపులు వస్తున్నాయి. పాకిస్తాన్కు చెందిన ఫోన్ నంబరు నుంచి అంజలికి బెదిరింపులు వస్తుండటం విశేషం. 'ఏక్నాథ్పై కేసును ఉపసంహరించుకోవాలని గత రాత్రి 12:33 గంటల సమయంలో 922135871719 నంబరు నుంచి బెదిరింపు ఫోన్ వచ్చింది' అని అంజలి తెలిపారు. ఈ నంబరు దావూద్ 2 పాకిస్తాన్ అని ట్రూకాలర్ సూచిస్తుందని చెప్పారు. ఈ బెదిరింపుపై ప్రధాని నరేంద్ర మోడీకి, హోం మినిష్టర్ రాజ్నాథ్ సింగ్కు ఫిర్యాదు చేసినట్టు అంజలి తెలిపారు. తనకు బెదిరింపు కాల్పై జాయింట్ సీపీ క్రైమ్ కార్యాలయంలో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ నెల 2న ఏక్నాథ్ జన్మదినం సందర్భంగా జరిగిన బహిరంగ సమావేశంలో తనపై అతను 'అసభ్యకర వ్యాఖ్యలు' చేసినట్టు వకోల పోలీస్ స్టేషన్లో అంజలి ఫిర్యాదు చేశారు. బహిరంగంగా వున్న ఈ వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో వున్నాయని ఫిర్యాదులో అంజలి ఆరోపించారు. మహారాష్ట్రలోని ముక్తైనగర్ నియోజకవర్గం నుంచి ఏక్నాథ్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.