Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనేశ్వర్: ఆర్థికపరమైన ఇబ్బందులు తాళలేక చనిపోవాలనుకున్న ఓ వ్యక్తి.. పులులు ఉన్న ఎన్క్లోజర్లో దూకాడు. ఈ ఘటన ఒడిషా రాజ ధాని భువనేశ్వర్ శివారులో ఉన్న నందంకనాన్ జూలో చోటు చేసుకున్న ది. కటక్ జిల్లా బలికూడా ప్రాంతానికి చెందిన ప్రకాశ్ పణి(52) స్థానికం గా ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. అయితే.. జీవితంపై విరక్తి చెందిన పణి శుక్రవారం నందంకనాన్ జంతు ప్రదర్శనశాలకు చేరుకున్నాడు. సాయంత్రర 4.30 గంటల ప్రాంతంలో అతడు 20 అడుగుల ఎత్తున్న ఫెన్సింగ్ ఎక్కి రెండు పులులు ఉన్న ఎన్క్లోజర్లోకి దూకాడు. అయితే జూ సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో అతడు ప్రాణాలతో బయట పడ్డాడు. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి రెండు పులులను(నందన్, బాహుబలి) ఎన్క్లోజర్లోని బోనుల్లోకి వెళ్లేలా చేసి, పణిని బయటకు తీసుకొచ్చారని జూ అధికారులు వెల్లడించారు. అతడిని పోలీసులకు అప్ప గించినట్టు వారు తెలిపారు.
నాలుగేండ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్యొ పాడుబడ్డ బావిలో మృతదేహం లభ్యంచంఢగీఢ్: ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన చిన్నారి.. చివరకు శవమై దొరికింది. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకున్నది. గుర్తు తెలియని దుండగులు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలోని బల్జీత్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న ఓ వ్యక్తికి నాలుగేండ్ల కూతురు ఉన్నది. కాగా ఆ చిన్నారిని ఈనెల 17న గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. చిన్నారి అదృశ్యంపై ఆమె తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. బంధువులు, పోలీసులు చిన్నారి కోసం వెతుకుతుండగా.. శుక్రవారం ఓ పాడుబడ్డ బావిలో శవమై కనిపించింది. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని, చిన్నారిపై లైంగికదాడి జరిగిందా? లేదా? అనే దానిపై పోస్టుమార్టంలోనే నిర్ధారణ అవుతుందని సీనియర్ పోలీసు అధికారి చాందిని బాగ్ వెల్లడించారు.