Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేం చెప్పినవన్నీ అబద్దాలే..!
- జయలలిత మృతిపై తమిళనాడు అటవీశాఖ మంత్రి
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పై తామందరమూ అబద్దాలే చెప్పామని ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి సి.శ్రీనివా సన్ పేర్కొన్నారు. ప్రజలను ఆయన క్షమాపణలు కోరారు. ఆస్పత్రిలో ఉన్న 'అమ్మ'ను తామెవరూ చూడలేదనీ, అయితే ఇడ్లీలు తింటుందని అబ ద్దాలు చెప్పామనీ తెలిపారు. మధురైలో శుక్రవారం రాత్రి జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జయలలిత మృతిపై వాస్తవాలు తమకు తెలియదన్నారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు అబద్దాలే చెప్పా రన్నారు. జాతీయ స్థాయి నాయకులు కూడా అపోలో ఆస్పత్రి చీఫ్ ప్రతా ప్రెడ్డి గదిలో మాత్రమే ఉండి వచ్చారన్నారు. వాస్తవంగా ఆమెను ఎవరూ చూడలేదని పేర్కొన్నారు. పార్టీ కార్యవర్గం కూడా వాస్తవ సమాచారాన్ని బహిర్గత పరచలేదన్నారు. జయలలిత మృతిపై ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో విమర్శకులు జైలులో ఉన్న శశికళ వైపు వెలెత్తి చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతిపై విశాంత జడ్జితో విచారణ కమిటీ వేస్తున్నట్లు తమిళనాడు పళనిస్వామి ప్రకటించారు.