Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏమివ్వాలో నిర్ణయించలేదు : కేంద్రం
న్యూఢిల్లీ : ఐసీడీఎస్ పథకం కింద పిల్లలకు ప్రస్తుతమిస్తున్న మధ్యాహ్నా భోజనానికి బదులు ఏమి ఇవ్వాలో ఇం కా నిర్ణయించలేదని మహిళా శిశు అభి వృద్ధి మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం 3 నుంచి 6ఏండ్ల మధ్యగల పిల్లలకు కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్నా భోజనాన్ని అంది స్తోంది. దాని స్ధానంలో పోషక ఆహార ప్యాకేట్లు గాని, వండుకోవడానికి సిద్ధంగా ఉండే ఆహారంగాని, నగదుగాని ఏదివ్వాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రిత్వశాఖ కార్యదర్శి రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు. దీనిపై విస్తృత చర్చ జరుగు తోందని ఆయన అన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టంలో ఒక భాగంగా ఉన్నందున దానిని రద్దు చేసే ఆలోచన ఏదీ లేదన్నారు. ఆహార భద్రతా చట్టం లోని సెక్షన్ 5, 6లో అంగన్వాడీలలో వేడిగా ఆహారాన్ని తయారు చేసే అంశాలు ప్రస్తావించి ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం మార్గదర్శకాలను మాత్రమే రాష్ట్రాలకు ఇవ్వగలదని, రాష్ట్రాలు చట్టాన్ని అతిక్రమించడానికి వీలు లేదని తెలిపారు. ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కోర్టుకు తీసుకెళ్తామన్నారు.