Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ పర్యటనలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఓట్లు ముఖ్యం కాదని, దేశం అభివృద్ధి చెందడమే ప్రధాన లక్ష్యమని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మోడీ తన పర్యటనను శుక్రవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీకి ఇదే తొలి పర్యటన. షహన్షాపూర్లో 'పశు ఆరోగ్య మేళా'ను శనివారం ప్రారంభించిన సందర్భంగా మోడీ మాట్లా డుతూ.. నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా కేంద్రం చిత్తశుద్ధితో పోరాడుతున్నదని తెలిపారు. అవినీతి కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారన్నారు. ఓట్ల కోసం తాను ఆలోచించడం లేదని చెప్పారు. అన్నింటికన్నా దేశ సౌభాగ్యమే గొప్పదని, పార్టీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తానని తెలిపారు. పాల ఉత్పత్తిలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్ వెనుకబడి ఉన్నదని, అందుకే పశుసంరక్షణపై దృష్టి పెట్టినట్టు ఆయన తెలిపారు. డెయిరీలు.. రైతులకు అదనపు ఆదాయ వనరులు అని తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమ న్నారు. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కోట్ల మంది ఇప్పటికీ ఇండ్లు లేకుండా నివసిస్తున్నా రని తెలిపారు.
2022లోగా వీరందరికీ ఇండ్లు కట్టిస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర్రంలో ఇండ్ల నిర్మాణానికి సంబం ధించిన వివరాలను కేంద్రానికి సమర్పించడంలో ఇంతకముందున్న అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని విమర్శించారు. రాష్ట్రానికి 10 వేల ఇండ్లు మాత్రమే అవసరమున్నాయని పేర్కొంటూ సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం జాబితా పంపినట్టు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే యోగి ప్రభుత్వం.. రాష్ట్రంలో లక్షకు పైగా ఇండ్లు నిర్మించాల్సి ఉన్నదని తెలుపుతూ లిస్టు పంపిందని చెప్పారు. స్వచ్ఛ భారత్పై మాట్లాడుతూ.. అపరిశుభ్ర వాతావరణంలో ఉండాలని ఎవరూ కోరుకోరన్నారు. స్వచ్ఛత అనేది తనకు పూజ(ఆరాధన) లాంటిదని, ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత అని మోడీ అన్నారు.