Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సదస్సులో బివి రాఘవులు
అమరావతి: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నిటిఆయోగ్ మూడేండ్ల కార్యాచరణ ప్రణాళికలో భాగంగానే దేశ ఆర్థిక వ్యవస్థపై 'సర్జికల్ స్ట్రైక్స్' చేసిందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి. రాఘవులు అన్నారు. విజయవాడ మాకినేని బసవపు న్నయ్య విజ్ఞానకేంద్రంలో ఆదివారం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మచిలీ పట్నం డివిజన్ 49వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు, జిఎస్టి, గోవధపై నిషేధం, ఆహార ధాన్యాల ధరల్ని విపరీతంగా తగ్గించడం వంటి నిర్ణ యాలతో దేశం మరింత ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయింద న్నారు. ముఖ్యంగా గత ఆరుత్రైమాసికాలుగా దేశస్థూల జాతీ యోత్పత్తి (జీడీపీ) క్రమంగా తగ్గుతూ వస్తోందన్నారు. 2015 -16 మొదటి త్రైమాసికంలో 9.2శాతం జిడిపి ఉంటే ఈ ఏడాది మొదటి త్రైమాసికానికి 5.7శాతానికి తగ్గిపోయింద న్నారు. అంటే 3.5శాతం జీడీపీ ఈ మూడేం డ్లల్లో తగ్గిందన్నారు. జీడీపీ ఒక శాతం తగ్గితేనే దాదాపు లక్ష ఉద్యోగాలు పోయినట్లేనని, ఇక 3.5 శాతం తగ్గితే అందుకు మూడున్నర రెట్లు ఉద్యోగాలు పోయినట్లేనని ఆర్థిక వేత్తలు విశ్లేషించారన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశఆర్థిక, సామాజిక వ్యవ స్థ మరింత సంక్షోభంలోకి వెళ్తందన్నారు. ముఖ్యంగా బీమా, బ్యాంకింగ్ రంగాలపై వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. 2030నాటికి చైనా కంటే ముందుం టా మని, ప్రపంచంలోనే అగ్రదేశంగా భారత్ నిలుస్తుందని ప్రధానిమోడీ, ఆర్థికమంత్రి జైట్లీ ప్రకటించారని గుర్తు చేశా రు. కానీ, దేశంలో మరింత ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితి తలెత్తుతోందన్నారు. జీడీపీ తగ్గుదల తాత్కాలికమేనని, సాం కేతిక మార్పు అంటూ జైట్లీ సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడని రాఘవులు పేర్కొన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు నిర్ణయాలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తీవ్ర నష్టం కలిగిందే తప్ప, బడా కార్పొరేట్ కంపెనీలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. గోవధపై నిషేధంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థతో ఉన్న ఒప్పందం ప్రకారమే ఆహార ధాన్యాల ధరలను నిర్ణయించి, రైతులకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించడంలేదన్నారు. ఆర్థిక వేత్త థామస్ పికెల్ అధ్యయనం ప్రకారం ఈ15 ఏండ్లలో దేశంలో ఆర్థిక అంతరాలు 30శాతం వరకు పెరిగాయన్నారు. ముఖ్యంగా దేశంలో 46శాతం సంపద ఒక శాతం ఉన్న బడా కార్పొ రేట్ల వద్ద ఉండగా, మిగిలిన 54శాతం సం పద 99శాతం ఉన్న సామాన్యుల వద్ద ఉందన్నారు. ఆర్థిక అంతరాలు పెరిగితే దేశం సంక్షోభంలోకి వెళ్తుందన్నారు. దేశంలో ఎగుమతుల శాతం తగ్గి, దిగుమతుల శాతం పెరుగుతోందన్నారు. దీంతో లోటు (కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ) పెరుగుతోందన్నారు. ముడి చమురు బ్యారెల్ ధర 130 నుంచి 140 డాలర్లు ఉండేదని, కాని ఇప్పుడు సగానికి ఆ ధర తగ్గినా ఖాతాలోటు ఎక్కువగానే కనిపిస్తోందన్నారు. నిటి ఆయోగ్లో కొలంబియా విశ్వవిద్యాలయ ఆర్థిక వేత్తలున్నారని, వారి సూచనలమేరకు ఆర్థిక సంస్కరణల పేరుతో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఆ సంస్కరణల్లో ప్రధానాంశమే ప్రభుత్వ- ప్రయివేటు భాగస్వామ్య విధానమన్నారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలు వెనుకబడేందుకు, నష్టపోయేందుకు మొండి బకాయిలే ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. మూడేండ్ల కింద రూ. 2 లక్షల కోట్లు ఉన్న ఈ మొండి బకాయిలు 2016 నాటికి 6 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. టెలికాం, పోర్టులు, విమానయాన రంగాల్లో కూడా మొండి బకాయిలు పేరకుపోయాయన్నారు. ప్రభుత్వం దొంగ చాటుగా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలను ప్రయివేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కార్మిక చట్టాల మార్పులో భాగంగా ఉద్యోగులను ' ఫిక్స్డ్ టర్మ్ ' ఉద్యోగులుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంద న్నారు. కార్మిక చట్టాల్లో బీజేపీ ఇలాంటి మార్పుల్ని తీసుకొచ్చి, వాటిని త్వరితగతిన అమలుచేసే ప్రయత్నం చేస్తోందన్నారు.ఈ విధానాలను ఐక్య పోరాటాల ద్వారానే ఎదుర్కొనగలమని ఆయన పిలుపునిచ్చారు. ఇన్సూరెన్స్ ఎంప్లాయూస్ అసోసియేషన్ దక్షిణ భారత జోనల్ కార్యదర్శి క్లైమేట్ దాస్ మాట్లాడుతూ ప్రజల సేవింగ్స్ను ప్రభుత్వం ప్రోత్సహించకుండా వాటిపై ఆదాయపు పన్ను విధిస్తోందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. ఇన్సూరెన్స్ రంగం పై వేసే 18 శాతం జిఎస్టి రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలు రంగాల్లో ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోందని, వచ్చే 9 ఏళ్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( ఐటి ) రంగం నుంచి దాదాపు 6 లక్షల ఉద్యోగాలు పోయే ప్రమాద ముందన్నారు.