Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాదుల ఆగడాలను తిప్పికొట్టాలి :డీివైఎఫ్ఐ బహిరంగ సభలో ఎంపీి సలీం పిలుపు
నెల్లూరు : ''దేశంలో పరిశ్రమల పేరుతో భూములు లాక్కుంటున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మాత్రం కల్పించడం లేదు. మోడీ అధికారంలోకి వచ్చాక యువతకు కోట్లాది ఉద్యోగాలిస్తామని ప్రచారం చేశారు. ఈ మూడేండ్లల్లో చేసింది శూన్యం. ఇప్పుడు ఐటి అభివృద్ధి జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. ఆ రంగమూ దెబ్బతినిపోవడం హైదరాబాద్, బెంగుళూరుల్లో చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో యువత ఉద్యోగం, ఉపాధి కోసం పోరాడాలి. మరోవైపు మతోన్మా దుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. వారి ఆగడాలను తిప్పి కొట్టాలి'' అని డివైఎఫ్ఐ అఖిల భారత పూర్వ కార్యదర్శి, పార్లమెంటు సభ్యులు ఎండి సలీం యువతకు పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ 14వ రాష్ట్ర మహాసభల సంద ర్భంగా తొలిరోజు ఆదివారం నెల్లూరులో బహిరంగ జరిగింది. సభలో ఎండి సలీం మాట్లాడుతూ.. దేశాన్ని ప్రస్తుతం మతం, భాష, ఆహారం, ఆవు పేరుతో ముక్కలు చేయాలని మతోన్మాద శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. అంతేగాదు.. హత్యలకూ తెగబడుతున్నాయన్నారు. ఇటీవల బెంగుళూరులో జర్నలిస్టు గౌరి లంకేష్నూ, త్రిపురలో యువ జర్నలిస్టునూ హత్య చేసిన విషయాన్ని గుర్తుచేశారు. శాస్త్రీయత, వాస్తవికత కోసం నిలబడినందుకు వారు హత్యగావించబడ్డారని విచా రం వ్యక్తం చేశారు. ఈ సభలో డివైఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షులు మహ్మద్ రియాజ్, ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు దీప, ఎస్ఎఫ్ఐ పూర్వ రాష్ట్ర కార్యదర్శి వి.ఉమా మహేశ్వరరావు, ఆహ్వాన సంఘం అధ్యక్షులు, శాసనమండలిలో పిడిఎఫ్ పక్ష నాయకుడు విటపు బాలసుబ్రమణ్యం, పీడీఎఫ్ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సూర్యారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.మాదవ్, తెలంగాణ డివైఎప్ఐ రాష్ట్ర కార్యదర్శి విజరు, కేంద్ర కమిటీ సభ్యులు రహీం పాల్గొన్నారు.