Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంచి : ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న దుర్ఘటనలో ఆరుగురు చనిపోగా, మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన జార్ఖండ్లోని సింఫ్ుబూమ్ జిల్లాలో చోటు చేసుకున్నది. ప్రమాదం జరిగిన ఇంటిలో బాణాసంచాను భారీ మొత్తంలో అక్రమంగా నిల్వ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. జిల్లాలోని కుమార్దుబీ గ్రామంలోని ఓ ఇంటిలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా నిల్వ ఉంచిన గదికి మంటలు వ్యాపించడంతో టపాసులు పెద్ద శబ్దంతో పేలాయి. ఫైర్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారని ఎస్పీ ప్రభాత్ కుమార్ వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్టు ఆయన వివరించారు. అయితే పేలుడు ధాటికి ఓ గోడ కూలిపోయిందని, శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని తెలిపారు.