Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు తేడా లేకుండా అందరూ పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నెలవారీ కార్యక్రమమైన 'మన్కీ బాత్' ఆదివారంతో మూడేండ్లు పూర్తి చేసుకున్నది. 36వ మన్కీ బాత్లో భాగంగా మోడీ మాట్లాడుతూ.. దేశ ప్రజలతో మమేకమై వారి మనోభావాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని చెప్పారు. స్వచ్ఛతే సేవ కార్యక్రమానికి ఊహించని మద్దతు లభిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను జీవిత విధానంగా మార్చుకోవాలని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ బలమని, ప్రధానంగా యువత ఈ విషయాన్ని గుర్తించాలని తెలిపారు. దేశంలో సందర్శకుడిలా కాకుండా, ఒక విద్యార్థిలా పర్యటించాలని, దాని ద్వారా వివిధ ప్రాంతాల్లోని పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. భర్తలు వీర మరణం పొందిన అనంతరం భారత సైన్యంలో చేరిన లెఫ్టినెంట్ కల్నల్లు స్వాతి మహదిక్, నిధి దుబేలకు ప్రత్యేక అభినందనలు తెలిపిన మోడీ.. వారు దేశానికి స్ఫూర్తి అని కొనియాడారు.