Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20లోపు విచారణ పూర్తి చేయాలని సీఐసీ ఆదేశాలు
న్యూఢిల్లీ : మహిళలకు ఏమైనా సమస్యలు వస్తే న్యాయం కోసం పోలీస్ స్టేషన్లు లేదా మహిళా కమిషన్లను ఆశ్రయిస్తారు. అలాంటిది జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)లో పనిచేస్తున్న ఓ మహిళా అధికారి సైతం లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అంతేగాకుండా, ఆమె సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద పెట్టుకున్న ఆర్జీని అధికారులు పట్టించుకోలేదు. దీంతో, న్యాయం కోసం ఆమె సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ను ( సీఐసీ) ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుపై స్పందించిన సీఐసీ అక్టోబర్20లోపు విచారణ పూర్తి చేసి అఫిడవిట్ సమర్పించాలని ఎన్సీడబ్ల్యూని ఆదేశించింది.