Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: గుజరాత్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు పటీదార్ నేత హార్థిక్ పటేల్ చెప్పారు. 'నేను ప్రతిపక్ష కాంగ్రెస్ విజయం కోసం కృషి చేయడం లేదు. అయితే మా సామాజిక వర్గానికి చట్టబద్ధమైన హక్కుల కోసం పోరాడుతున్నాను' అని చెప్పారు. 'కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అంటే నియంతృత్వ ధోరణిని ఓడించడమే' అని అన్నారు. ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా నేను పోరాటం చేయడం లేదని, వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని ఆయన అన్నారు.