Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
బెంగుళూర్ : బెంగుళూర్లో ఈజిపూర ప్రాంతంలో సోమవారం ఓ భవనం కుప్పకూలింది. ఈదుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరి కొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. సిలిండర్ పేలుడుతో భవనం కూలిపోయిందని కాలనీవాసులు అనుమానిస్తున్నారు. భవనంలో ఒకేసారి భారీ పేలుడు శబ్దం వినిపించిందని, సమీపంలోని నాలుగు బిల్డింగులు ధ్వంసమయ్యాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. స్థానిక మీడియాతో కర్నాటక హోం మంత్రి రామలింగారెడ్డి మాట్లాడారు. సిలిండర్ పేలుడుతోనే భవనం కూలిపోయిందనేందుకు ఘటనాస్థలంలో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. ఆయన వాదనకు రాష్ట్ర మంత్రి కేజే జార్జ్ మద్దతు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.5లక్షల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కాగా, శిథిలాల కింద చిక్కుకున్న ఓ మైనర్ బాలికను సహాయక బృందాలు సురక్షితంగా రక్షించాయి. ఈ దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన బాలికను దత్తత తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని జార్జి తెలిపారు.