Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిరాయి మనుషులతో ధర్నా
- మధ్యలోంచే వెళ్లిపోయిన మహిళలు
- అరెస్టులు ప్రారంభంతో నిరసన విరమణ : హాజరైన కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
జనరక్ష యాత్ర పేరిట సీపీఐ(ఎం) కార్యాలయాల ముందు బీజేపీ మహిళా మోర్చా అత్యుత్సాహం ప్రదర్శించింది. కిరాయి మనుషులతో ధర్నా చేపట్టి అభాసుపాలైంది. నిరసన కార్యక్రమం మొదలైన కొద్దిసేపటికి మహిళలు వెనుదిరిగారు. ఇక సీపీఐ(ఎం) కార్యాలయ ముట్టడికి బయల్దేరిని బీజేపీ మహిళా నేతలు.. పోలీసులు అరెస్టులు ప్రారంభించడంతో ధర్నాను హఠాత్తుగా నిలిపేస్తున్నట్టు ప్రకటించడం కొస మెరుపు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ హాజరయ్యారు. జనరక్ష యాత్రలో భాగంగా సోమవారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) కార్యాలయ ముట్టడి చేపట్టారు. మొదట ర్యాలీగా బయల్దేరిన మహిళలు.. సీపీఐ(ఎం) కార్యాలయ సమీపంలో ధర్నా కార్యక్రమం చేపట్టా రు. ఈ కార్యక్రమానికి బీజేపీ మహిళా మోర్చా నేతలు విజయ, పూనమ్, లతతో పాటు బీజేపీ నేత సరోజ్పాండే, కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ హాజరయ్యారు. అయితే బీజేపీ ఢిల్లీ యూనిట్ అధ్యక్షులు మనోజ్ తివారీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో దీపావళి మిలన్లో పాల్గొన్నారు.ర్యాలీ సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోగానే.. చాలా మంది మహిళ లు మధ్యాహ్నం 12గంటల వరకే రమ్మన్నారంటూ వెళ్లిపోయా రు. దీంతో కేంద్రమంత్రి పది నిమిషాల్లో తన ప్రసంగం ముగిం చారు. ప్రసంగాలు ముగిసిన తరువాత మహిళా మోర్చా నాయ కులు బారీకేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. బారీకేడ్లు ఎక్కి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈక్రమంలో పోలీసులు అరెస్టులు ప్రారంభిస్తారనగా... హఠాత్తుగా నిరసన కార్యక్రమాన్ని ముగిస్తున్నట్టు ప్రకటించారు. అంతకముందు సీపీఐ(ఎం), కేరళ సీఎం పినరయి విజయన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.