Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ గౌరవ యాత్ర ముగింపు సభలో మోడీ
గాంధీనగర్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి అభివృద్ధిఎజెండాతో దిగుతామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అభివృద్ధిలో తమతో పోటీలో నిలవాలని కాంగ్రెస్కు సవాల్ విసిరారు. గాంధీనగర్లో జరిగిన గుజరాత్ గౌరవ్ యాత్ర ముగింపు సభలో మోడీ ప్రసంగించారు. అభివృద్ధి వాదం, వారసత్వ రాజకీయాలు మధ్య జరిగే పోరుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను పోల్చారు. కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి ఆశావాదం లోపించ డం, నిరాశావాదాన్ని ఆశ్రయించడమే కారణమని విమర్శించారు. నెహ్రూ విజన్ విషయంలో కాంగ్రెస్ కంటే తాము చేసిందే ఎక్కువని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరాశావాద వాతావరణాన్ని సృష్టి స్తోందని మోడీ ఆరోపించారు. గుజరాత్ అభివృద్ధి ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణా న్ని యూపీఏ సర్కార్ పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాని బీజేపీ విజయాల మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా అభివర్ణించారు.