Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ఆయుర్వేద ఇనిస్టి ట్యూట్ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళ వారం ప్రారంభించారు. రెండో ఆయుర్వేద దినోత్స వాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద(ఏఐఐఏ)ను మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సంద ర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఒక ఆయుర్వేద ఆస్పత్రి ఉండాలన్నారు. ఇందుకోసం ఆయుష్ మంత్రిత్వశాఖ కృషి చేస్తుందన్నారు. 'ఒక దేశం ఏ రకంగానైనా అభివృద్ధి చెందగలదు. కానీ ఆ దేశ చరిత్ర, వారసత్వ సంపదను గర్వించే స్థాయికి తీసుకెళ్లేంత వరకు ఏ దేశమూ ముందుకు సాగలేదు.' అని మోడీ అన్నారు.