Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొచ్చి: కేరళలో తొలి దళిత పూజారిగా నియమితులైన యదు కృష్ణన్ను సీపీఐ(ఎం) మంగళవారం సన్మానించింది. సీపీఐ(ఎం) ఎర్నాకు ళం కార్యదర్శి, మాజీ ఎంపీ పి.రాజీవ్ చేతులుమీదుగా ఈ సన్మాన కార్యక్ర మం జరిగింది. కేరళ దేవస్థాన బోర్డు పరిధిలోని పలు దేవాలయాల్లో ఆరుగురు దళితులు సహా 36మంది బ్రాహ్మణేతర కులాలకు చెందిన వారిని అక్కడి వామపక్ష ప్రభుత్వం ఇటీవల పూజారులుగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఆరెస్సెస్ మినహా కేరళలోని అన్ని వర్గా ల వారు సాదరంగా ఆహ్వానించారు.