Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర సర్కారుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
ముంబయి: ప్రభుత్వ విధానాలు, పథకాలపై ప్రచారం నిర్వహించేం దుకు 11ప్రయివేటు ప్రకటనా ఏజెన్సీలను మహారాష్ట్ర సర్కారు నియమిం చడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ప్రభుత్వం కోట్లాది రూపాయ లను దుబారా చేస్తున్నదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఫడ్నవీస్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం.. పబ్లిక్ రిలేషన్స్ విభా గం పరిధిలో అమలవుతున్న పథకాలపై 11 ప్రయివేటు అడ్వర్టైజింగ్ కంపెనీలు.. పోస్టర్లు, బ్యానర్లు, ఆడియో-వీడియో.. ప్రత్యేకించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించనున్నాయి. అయితే.. ఇందుకోసం ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చించనున్నది.