Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీనగర్ : గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం వాగ్దానాల పర్వం మొదలుపెట్టింది. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకపోవడంతో 'ఉచితా లను' ప్రకటించేస్తోంది. తాజాగా గ్రామీణ రైతులను ఆకట్టుకునేందుకు రూ.3 లక్షల వరకూ వడ్డీ రహిత రుణాలను ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి విజరు రుపాని ప్రకటించారు. దీనివల్ల 25 లక్షల మంది రైతులకు లబ్దిచేకూరుతుందని చెప్పారు. బీజేపీ కార్యకర్తలతో ఏర్పాటుచేసిన 'గుజరాత్ గౌరవ్ సమ్మేళన్' సభలో సోమవారం ఆయన మాట్లాడారు. 'రైతులకు ఇచ్చే రుణాలకు సంబంధించిన ఏడు శాతం వడ్డీని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భరిస్తాయి' అన్నారు.