Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: దేశంలో మత కల్లోలాలను సృష్టించేందుకు, ప్రస్తుత రాజ్యాంగాన్ని సవరించేం దుకు ప్రయత్నిస్తున్న బీజేపీ- ఆరెస్సెస్ను అడ్డుకు నేందుకు దళితులు, ముస్లింలు ఏకం కావాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. రాష్ట్రీయ బహుజన్ హిత్ రక్షక్ సమితి 85వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ఇక్కడ 'బంధరన్ బచా వో(రాజ్యాంగాన్ని రక్షించండి)' పేరుతో నిర్వహిం చిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీని ఎన్నికల్లో ఓడిస్తే సరిపోదని, రాజ్యాంగంలో సమూల మార్పులకు చేస్తున్న ప్రయత్నాల్లోనూ ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ''మీ ముందు మ నువాదం, రాజ్యాంగం అనేరెండు అవకాశా లున్నాయి. మీతరం క్షేమంగా ఉండాలంటే రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలి'' అని ఆయన తెలిపారు.