Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 మంది విద్యార్థినుల బహిష్కరణపై ఆగ్రహం
కోల్కతా: బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉన్న సత్యజిత్ రారు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా విద్యార్థులు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. డిమాండ్లు నెరవేర్చేవరకు ఆందోళనను కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. సోమవారం 14 మంది విద్యార్థినులను బహిష్కరించ డంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై నిలదీస్తే వేటు వేస్తా రా? అని ప్రశ్నించారు. అడ్మినిస్ట్రేషన్ అనుసరిస్తున్న నియంతృత్వ పోకడ లను ఇకనైనా మానుకోవాలన్నారు. హాస్టళ్లలో మౌలిక సదుపా యాలు కల్పించడం, తక్కువ జరిమానాలు విధించడంతో పాటు క్యాంపస్లో ప్లేస్ మెంట్ సెల్ను ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.