Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చంఢగీఢ్ : హర్యానాలో ఓ యువ గాయని దారుణ హత్య కలకలం రేపింది. పానిపట్ గ్రామంలో హర్షిత దాహియే (22) అనే గాయనిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. పానిపట్ ఎస్పీ రాహుల్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం...చమ్రారా గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో హర్షిత పాల్గొన్నది. కార్యక్రమం ముగిసిన అనంతరం కారులో ఆమె ఢిల్లీకి తిరుగు ప్రయాణమైంది. పానిపట్ శివారు ప్రాంతానికి చేరుకోగానే కొందరు గుర్తు తెలియని దుండగులు ఆమె ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. ఆ సమయంలో హర్షితతో పాటు కారులో మరో ఇద్దరు ఉన్నారు. దుండగులు కారులో ఉన్న ఇద్దరిని దిగిపోవాలని బెదిరించారు. అనంతరం హర్షితపై కాల్పులకు పాల్పడి ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.