Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోని రాజకీయ పార్టీల్లో బీజేపీనే ధనిక పార్టీ అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ ( ఏడీఆర్) సంస్థ మంగళవారం వెల్లడించింది. 2004-05లో రూ.122.93కోట్లు ఉన్న బీజేపీ ఆస్తులు క్రమక్రమంగా పెరిగాయని తెలిపింది. 2015-16లో బీజేపీ ఆస్తుల విలువ రూ.893.88కోట్లకు చేరుకుందని తెలిపింది. ధనిక పార్టీల జాబితాలో రెండో స్థానంలో ప్రతిపక్షం హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నదని ఏడీఆర్ పేర్కొన్నది. కాంగ్రెస్ ఆస్తులు కూడా పెరిగిపోయినట్టు తెలిపింది. 2004-05లో రూ.167.35కోట్లు ఉన్న కాంగ్రెస్ ఆస్తులు 2015-16లో రూ.758.79కోట్లకు చేరుకున్నాయి. 11ఏండ్ల కాలంలో రూ.0.25కోట్లు ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆస్తులు రూ.44.99 కోట్లకు చేరుకున్నాయి.