Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రాహ్మణ పరిషత్ 'కళ్యాణమస్తు' పథకం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
వేదపండితులు, అర్చకులు, పురోహితులను పెండ్లి చేసుకొనే అమ్మాయిలకు మూడు లక్షల రూపాయల పారితోషికాన్ని ఇవ్వాలని నిర్ణయించిన ట్టు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రకటిం చింది. మంగళవారంనాడు సచివాలయంలో పరిషత్ అధ్యక్షులు డాక్టర్ కెవి రమణాచారి అధ్యక్షతన కార్యనిర్వాహక సమావేశం జరిగింది. సభ్యులు డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి, సిహెచ్ అనిల్కుమార్, పరిశ్రమలశాఖ అడిషనల్ డైరెక్టర్ ఆర్బి దేవానంద్, కె కిషన్రావు, కన్వీనర్ ఎ చంద్రమోహన్, పురాణం సతీష్, సువర్ణా సులోచన తదితరులు పాల్గొన్నారు. పురోహితం చేస్తున్న బ్రాహ్మణ యువకులకు సకాలం లో వివాహాలు కావట్లేదని, మారుతున్న సమాజ స్థితి గతుల్లో వారిని వివాహం చేసుకొనేందుకు యువతు లు ముందుకు రావట్లేదని చెప్పారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాల్లో ఇదో పెద్ద సమస్యగా ఉన్నద ని అభిప్రాయపడ్డారు. దీనిపై కార్యవర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ అనంతరం వేదపండితులు, అర్చకులు, పురోహితుల్ని వివాహం చేసుకొనే యువతులకు రూ.3 లక్షలు పారితోషికంగా ఇవ్వాలని నిర్ణయించి నట్టు తెలిపారు. వివాహానంతరం మూడేండ్ల కాల పరిమితితో ఈ మొత్తాన్ని నూతన దంపతుల పేర ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తామని వివరించారు. ఆ తర్వాతే ఆ సొమ్మును దంపతులు తీసుకొనేలా విధాన నిర్ణ యం తీసుకున్నట్టు చెప్పారు. వేదపాఠశాలల్లో వేద విద్యను అభ్యసించి, బయటకు వచ్చే విద్యార్ధులకు రూ.3 లక్షలకు తక్కువ కాకుండా పారితోషికాన్ని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. బ్రాహ్మణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, స్వయం ఉపాధి పొందే వారికి బ్రాహ్మణ పారిశ్రామిక అభివృద్ధి పథకం (బెస్ట్) సమర్ధవంతంగా అమలవుతోందని తెలిపారు. 56 మంది దరఖాస్తుదారులకు ఈ పథకం క్రింద రూ.3.29 కోట్లను ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని ఇచ్చేలా సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. సరస్వతి విద్యా ప్రశస్తి పథకం క్రింద పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివే 252 మంది విద్యార్ధులకు ఆర్ధిక సహాయాన్ని ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్ళే 56 మంది బ్రాహ్మణ విద్యార్ధులకు వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీం ద్వారా రూ.1.16 కోట్లను మంజూరు చేశామన్నారు. పీజు రీయింబర్స్మెంట్ స్కీం, పెన్షన్ స్కీం, హెల్త్ స్కీంల ద్వారా పేద బ్రాహ్మణులకు ఆర్ధిక తోడ్పాటును అందిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బ్రాహ్మణ పరిషత్కు రూ.వంద కోట్లు కేటాయించారని, ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు లోపు సంక్షేమ పథకాల్ని మరింత విస్త్రుతం చేస్తామన్నారు. పేద బ్రాహ్మణులు ప్రభుత్వ పథకాల్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.