Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధ్యుమ్న హత్య కేసులో కోర్టుకు తెలిపిన సీబీఐ
గుర్గావ్: రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన బాలుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. కేసులో ఎలాంటి ప్రమేయం లేకున్నా.. నేరం చేసినట్టు ఒప్పుకోవాలని స్కూల్ బస్సు కండక్టర్ అశోక్ కుమార్, మరో వ్యక్తిని పోలీసులు వేధింపులకు గురి చేశారని గుర్గావ్ కోర్టుకు సీబీఐ గురువారం తెలిపింది. రెండో తరగతి చదువుతున్న ప్రధ్యుమ్నను సీనియర్ విద్యార్థి హత్య చేశాడని సీబీఐ ఇటీవల తేల్చిన సంగతి తెలిసిందే. అయితే.. కేసులో అశోక్ కుమార్కు క్లీన్చిట్ ఇవ్వలేదని సీబీఐ స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన కెమికల్, ఇతర రిపోర్టులు ఇంకా తమ చేతికి అందలేదని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రజనీయాదవ్కు తెలిపింది. రిపోర్టులన్ని వచ్చిన తర్వాత దర్యాప్తు పూర్తి చేసి అశోక్కుమార్ విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ క్రమంలోనే కోర్టులో అశోక్కుమార్ వేసిన బెయిల్ పిటిషన్ను సీబీఐ వ్యతిరేకించింది.