Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చింతూరు: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ప్రెజర్బాంబు పేలి ఒక జవాను మృతి చెందాడు. సీఆర్పీఎఫ్ 150వ బెటాలియన్లో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం పొదలాడకు చెందిన కోళ్ల వెంకన్న (43)ను సీిఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించేవాడు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో జరుగుతున్న కూంబింగ్కు తన బందంతో వెళ్లాడు. ఆదివారం తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై కాలు మోపడంతో బాంబు పేలి తీవ్రంగా గాయపడ్డాడు.
అతడిని హెలికాఫ్టర్లో ఒడిశా రాష్ట్రం రాయపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయినట్లు సీఆర్పీఎఫ్ క్యాంపు కార్యాలయం నుంచి తమకు సమాచారం అందిందని రాజోలు ఎస్ఐ ఎస్.లక్ష్మణరావు తెలిపారు.