Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా: బీహార్లోని ఓ వైద్య కళాశాలలో ఆలస్యంగా వెలుగులో కొచ్చిన ర్యాగింగ్ ఘటన సంచలనం సృష్టించింది. దర్భాంగ వైద్య కళాశా లలో వెలుగుజూసిన ఈ ఘటనకు సంబంధించి 54 మంది విద్యార్థిను లపై భారత వైద్య మండలి(ఎమ్సిఐ) చర్యలు తీసుకుంది. ఒక్కొక్కరికి రూ. 25వేల జరిమానా విధించింది. అయితే వీరిపై పోలీసు స్టేషనులో కేసు నమోదు కాలేదు. వివరాల్లోకెళితే దర్భాంగ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిని కొంతమంది సీనియర్ విద్యార్థినులు తనను ర్యాగింగ్ చేశారని ఆరోపించారు. అయితే ఆమె కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయకుండా నేరుగా ఎమ్సిఐకి తీసుకున్నారు.